+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో శబ్దకాలుష్యం నానాటికీ అధికమవుతూ అగ్రస్థానంలో ఉందని కాలుష్య నివారణలోనూ, ఆరోగ్య సాధనలోనూ యోగ విభాగానికి ప్రాధాన్యము లభిస్తున్నట్లు వివరించారు. శబ్దం శ్రవణ సుఖంగా సుభగంగా ఉండాలని సంగీతశాస్త్రం మానవజాతి వికాసంలో భాగం కావాలని ఆయన హితవు పలికారు. కర్ణభేరిని బ్రద్దలు చేసే విపరీత శబ్దాలకు మాధుర్యం ఉండదని సోదాహరణంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.