+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మాతృ గణపతి ఉత్సవాలు టిటిడి కళ్యాణ మండపం జిల్లెళ్ళమూడిలో 31/8/2022 నుండి 3/9/2022 వరకు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొదటిరోజు విద్యార్థి గణపతికి శాస్త్రోక్త విధానంతో పూజలు జరిపారు. శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు శమంతకోపాఖ్యానాన్ని ప్రేక్షకులకు వినిపించారు. మూడు రోజుల పాటు విద్యార్థినీ విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమంలో ఉదయం ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు శ్రీకృష్ణ కుచేల స్నేహబంధం అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు అమ్మ శేష వస్త్రాలతో మల్లాప్రగడ వారిని సత్కరించారు. మూడోరోజు ఉదయం బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకురాలు శ్రీమతి మైలవరపు లలిత కుమారి గారు మనుచరిత్ర అనే ప్రబంధం గురించి సోదాహరణంగా వివరించారు. శ్రీమతి బూదరాజు వాణి అక్కయ్య గారు లలిత కుమారి గారిని అమ్మ శేష వస్త్రాలతో సత్కరించారు. త్రిరాత్రి ఉత్సవాలలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన జాతి రత్నాలు, ఆడాళ్ళు మీకు జోహార్లు, డాక్టర్ 2.0, లేట్ కామర్స్, స్కూల్ బంక్, పెళ్లిచూపులు మొదలైన హాస్య నాటికలు చూపరులను అలరించాయి. బి. ఎ. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అమరకోశం శ్లోక కంఠ పాఠాన్ని వినిపించారు. సినీ పాటల నృత్యాలను ఎంతో చక్కగా ప్రదర్శించారు. నాలుగో రోజు ఉదయం గణేష్ మహరాజ్ కి జై అంటూ గణేశ నినాదాలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.