+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుదే కీలకపాత్ర అని ఉభయపరిషత్తుల జనరల్ సెక్రెటరీ శ్రీదేశిరాజు కామరాజుగారు వివరించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 16వ తేదీ మంగళవారం వాత్సల్యాలయంలో జరిగిన గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన తమ సందేశం అందించారు. ఇదే వేదికపై అమ్మ భక్తులు టి.టి. అప్పారావు గారు అజ్ఞానాన్ని పారద్రోలి సమాజాన్ని జ్ఞానకాంతులతో ప్రకాశింప జేసే గురువుకు సమాజంలో సమున్నత స్థానం లభించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అధ్యాపకులు డాక్టర్ కె.వి.కోటయ్యగారు. మాట్లాడుతూ గురుపౌర్ణమి అందించే సందేశాన్ని విద్యార్థులు త్రికరణశుద్ధిగా పాటించాలని హితవు పలికారు. గురుపౌర్ణమిలో ప్రధాన కార్యక్రమముగా అమ్మ జీవితచరిత్ర పారాయణాన్ని బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవాలని జ్ఞానకాంతులు ప్రకాశించాలని కోరుతూ పెద్ద ఎత్తున అమ్మ భక్తురాలు అయిన సుబ్బలక్ష్మిగారి పర్యవేక్షణలో దీపాలంకరణ నిర్వహించారు.