+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమిషనర్ అధికారి జి.వి.జి కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. సుధామ వంశీ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశమనీ, మన దేశ గౌరవాన్ని ఇనుమడింప జేసే విధంగా విద్యార్థులు ఉండాలని హితవుపలికారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన జిల్లెళ్ళమూడి గ్రామంలో పతాకావిష్కరణ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ బ్రహ్మాండం రవీంద్ర రావు గారు, మేనేజింగ్ ట్రస్ట్ యమ్. దినకర్ గారు, శ్రీరామమూర్తి గారు, శ్రీ రామ చంద్రగారు, శ్రీమన్నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పలు దేశభక్తి గీతాలను ఆలపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ ప్రేమకుమార్ గారు తమ సందేశాన్ని అందించారు.