+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్ ఆంజనేయులు గారు వివరించారు. జూలై 12 వ తేదీ శుక్రవారం కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ భాషలలో సంస్కృతానికి సముచిత స్థానం లభించడానికి ఆనాటి సంస్కృత వాఙ్మయమే ప్రధాన కారణమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.వి. సుధామ వంశీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబు మాట్లాడుతూ సంస్కృత భాషా శిబిరాలను తరచుగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వేదాలు, ఉపనిషత్తులు, సారస్వత వాఙ్మయం, సంస్కృత భాషలోనే ఉందని వివరించారు. విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో సంస్కృత భాషను సమగ్రంగా నేర్చుకోవడానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంస్కృత అధ్యాపకులు డా అన్నదానం. హమమత్ ప్రసాద్ గారు. స్వాగతం పలుకగా, సంస్కృత అధ్యాపకులు డా. పావని వందన సమర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు సంస్కృతంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.