+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

అమ్మ ఆస్థాన విద్వాంసునిగా అమ్మ అనుగ్రహంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ రావూరి ప్రసాద్ ఒక అర్థమండలం రోజులపాటు దాదాపు 30 మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు చక్కని పాటలు రాగయుక్తంగా పాడటానికి శిక్షణ యిచ్చి 28.7.2018 నాడు వాద్యకారుల సహకారంతో నేర్చుకున్న అందరు విద్యార్థుల చేత సామూహిక పాటల కచేరి, వ్యక్తిగత గాన కచేరి చేయించి విద్యార్థులు, ఆచార్యులు, అందరింటి సోదరులకు వీనుల విందు చేశారు. దాదపు రెండు గంటలపాటు అందరూ తమను తాము మరచి అమృతగాన పారవశ్యంలో మునిగిపోయారు.కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, ఆచార్యులు, పాలకవర్గపెద్దలు శ్రీ రావూరి ప్రసాద్ను పొగడ్తలతో ముంచెత్తి సత్కరించారు. శ్రీరావూరి ప్రసాద్ శిక్షణా కార్యక్రమం అమ్మ ఆదేశంగా భావించి చేశానని అన్నివిధాల సహకరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ సుగుణ, పరిషత్ కార్యదర్శి శ్రీరామచంద్రలకు కృతజ్ఞతలు పలికి సత్కరించారు.