+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

విజ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పూజించే సత్సంప్రదాయానికి వేదిక గురుపూర్ణిమ అని ప్రముఖ సాహితీవేత్త ప్రవచన కళానిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వివరించారు. జులై 29 శుక్రవారం అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో జరిగిన గురుపౌర్ణమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువును పూజించడం ప్రతి ఒక్కరి ధర్మమని వివరించారు. అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసాదించే గురువును పూజించి ప్రతి ఒక్కరూ జన్మను సార్థకం చేసుకోవాలని మల్లాప్రగడ హితవు పలికారు. కార్యక్రమంలో భాగంగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణగారిని ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వజనని అమ్మ దివ్యచరిత్ర మహోదధిలో తరంగాలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు.గురుపౌర్ణమి సందర్భంగా అమ్మభక్తురాలు సుబ్బలక్ష్మిగారు పలువురు అమ్మ భక్తులు, అభిమానులు, విద్యార్థినీ విద్యార్థులు దీపోత్సవం నిర్వహించారు. అజ్ఞానాంధకారం అంతరించి విజ్ఞానకాంతులుగా ప్రకాశించాలని కోరుతూ అమ్మని ప్రార్థించారు.