+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

హైమవతీదేవి 77వ జయంతి ఉత్సవాలు ది. 18-11-2019న కన్నులపండుగగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా  లలితా కోటి నామ పారాయణ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 7 గంటలకు లలితా కోటి నామ పారాయణను రామాయణ రసభారతి బ్రహ్మ శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు సభలో ఆరంభించారు. పలువురు భక్తులు గ్రామాలనుండి  విచ్చేసి లలితా కోటిలో పాల్గొన్నారు. పారాయణ యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. అంతకుముందు ది. 14-11-2019 నుండి హైమవతీదేవికి వివిధ అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఏకాంతంగా అన్నపూర్ణార్ణాలయంలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేశారు.