+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

వార్తలు ఆధ్యాత్మిక, ధార్మిక, పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన మానసిక స్థితికి తోడ్పడుతాయని “అమ్మలో అమ్మ” గ్రంథకర్త వేదాద్రి బ్రహ్మజ్ఞాన కేంద్రం నిర్వాహకులు, విశ్రాంత అధ్యాపకులు అయిన స్వామి ఓంకారానందగిరి వివరించారు. ఈ నెల 10వ తేదీ గురువారం వాత్సల్యాలయం సమావేశమందిరంలో జరిగిన సభలో తాను రచించిన “అమ్మలో అమ్మ” గ్రంథావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. వసుంధరక్కయ్య జ్యోతి ప్రజ్వలనం చేశారు. ప్రిన్సిపాల్ శ్రీ సుధామవంశి ప్రారంభించారు. ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు ఈ సభకు అధ్యక్షత వహించగా కరస్పాండెంట్ శ్రీపి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్గారు. చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, గ్రంథావిష్కరణ చేశారు. విశ్రాంత్ర ప్రిన్సిపాల్ డా. బి.యల్.సుగుణ, అమ్మభక్తులు టి.టి. అప్పారావు శ్రీ యం. దినకర్ తదితర ప్రముఖులు ప్రసంగించారు