+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

20-2-2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతిగృహంలో ఫిబ్రవరి 20 వ తేదీ శనివారం అమ్మ ఆగమనోత్సవం వైభవంగా జరిగింది. పచ్చని తోరణాలతో, రంగవల్లులతో, పుష్పాలతో ఎంతో అందంగా వసతిగృహాన్ని అలంకరించారు. విద్యార్థినులు అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. లలితా సహస్రనామ పారాయణ చేశారు. కార్యక్రమంలో సంస్థపెద్దలు విశ్వజననీ ట్రస్టు అధ్యక్షులు ఛైర్మన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, వసుంధరక్కయ్య, కళాశాల అధ్యాపక బృందం, ఆవరణలో పలువురు పెద్దలు విచ్చేసి అమ్మకు నమస్కరించి విద్యార్థినులను ఆశీర్వదించారు.