+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

21.2.2021 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు కళాశాల అనసూయేశ్వర వసతి గృహంలో ఆదివారం నాడు అమ్మ ఆగమనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో శ్రీ విశ్వజననీ పరిషత్ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ప్రెసిడెంట్ యమ్. దినకర్గారు, జనరల్ సెక్రటరీ డి.వి.యన్. కామరాజు గారు మరియు కమిటీ సభ్యులు పి. గిరిధర్ కుమార్ గారు, చక్కా శ్రీమన్నారాయణగారు, టి. మురళీధర్ గారు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రంగవల్లులతో పచ్చని తోరణాలతో కన్నులపండుగగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు లలితాసహస్రనామ పారాయణ చేసి ప్రసాదవితరణతో కార్యక్రమాన్ని ముగించారు