+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

డా॥ జయంతి చక్రవర్తి ఆధ్వర్యంలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాల ఆధ్వర్యంలో గణేశ ఉత్సవాలు సెప్టెంబరు 13, 14, 15 తేదీలలో ఘనంగా జరిగాయి. మాతృశ్రీ సంస్థ ప్రాంగణంలోని టి.టి.డి. కళ్యాణమండపంలో 13వ తేదీ ఉదయం విశేష పూజలు ఘనంగా జరిగాయి. సంస్థ పెద్దలు శ్రీ యమ్. దినకర్, వసుంధరక్కయ్య, స్థానిక కార్యదర్శి శ్రీ భట్టిప్రోలు రామచంద్రగారు, డాక్టర్ బి.యల్. సుగుణగారు, అధ్యాపక ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శమంతకోపాఖ్యానం, విద్యార్థినుల భక్తిగీతాలు, సాయంత్రం పూజా కార్యక్రమం పద్యనివేదనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థినుల నృత్యప్రదర్శన కళాశాల విద్యార్థినుల నాటికలు ప్రదర్శంచబడ్డాయి. 14వ తేదీ పూజా కార్యక్రమం తరువాత విద్యార్థినులు పద్యపఠనం చేశారు. ఓంకారానందగిరిగారు వినాయక ప్రాశస్త్యం గురించి వివరించారు. మంగళగిరి నుండి వచ్చిన మధురిమ, అఖిల (5వ తరగతి) నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. అదేరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నవ్వుల జల్లులు, పెళ్ళిగోల, కార్పోరేట్ వైద్యం, దశావతారం నృత్యం, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ తదితర నాటికలను ప్రదర్శించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థినులు స్నేహంతో రా స్కిట్న ప్రదర్శించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. విద్యార్థులు సినిమా సందడి స్కిట్ నవ్వులజల్లు కురిపించింది. 15వ తేదీ ఉదయం పూజాకార్యక్రమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో గణేశ నిమజ్జనం నిర్వహించారు.