21.2.2019 న ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత భాషాభిమానులపై ఉందని, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ వివరించారు. ఫిబ్రవరి 21 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా ప్రశస్తిని సోదాహరణంగా వివరించారు. బెంగాళీలు తమ మాతృభాషను కాపాడుకోవడానికి చేసిన ప్రాణత్యాగాలను వివరించారు. ఇదే వేదికపై తెలుగు అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్య గారు మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలుగు పద్యం ఆద్యంతం హృద్యమనీ చెబుతూ తెలుగు పద్యంలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని విపులీకరించారు. కాగా ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు డా॥ మడకా సత్యనారాయణ గారు నిర్వహించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మాతృ భాషాభిమానులకు, సాహితీ వేత్తలకు జేజేలు పలికారు. పి.డి.సి. ప్రథమ సంవత్సరం (సంస్కృతం) విద్యార్థిని వసంత, పి.డి.సి. ద్వితీయ సంవత్సరం గోవింద్ తదితరులు ఈ సభలో మాట్లాడారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
by Parimala Vempati | Feb 21, 2019 | International Commemorative Days | 0 comments