+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

15.08.2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో 15.8.21 ఆదివారంనాడు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. వైభవంగా కళాశాల మరియు పాఠశాలల కరస్పాండెంట్ శ్రీమతి బి.యల్.సుగుణ గారు పతాకావిష్కరణ చేశారు. ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ ప్రెసిడెంట్ గారు శ్రీ యమ్. దినకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు, శ్రీ. పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు, శ్రీ రావూరి ప్రసాద్ గారు, శ్రీ బూదరాజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పాల్గొన్నారు. పలువురు దాతలు విద్యార్థులను ప్రోత్సహిస్తూ అందించిన బహుమతులను సంస్థ పెద్దలు అందించారు. పూర్వ విద్యార్థి సంఘప్రతినిధిగా జయంతి చక్రవర్తి గారు పాల్గొని విద్యార్థులకు, లైబ్రరీకి పుస్తకాలను అందజేశారు. జిల్లెళ్ళమూడి గ్రామసర్పంచ్ గండికోట లక్ష్మి గారు, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. చివరిగా మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.