+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నందు లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీమతి యిల్  మృదులగారికి నాగార్జున విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ పట్టాను పంపిణీశారు. శ్రీ కొండముది రామకృష్ణ గారి సాంగత్యం- పరిశీలన అనే అంశంపై ఈ పట్టాను పొందారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు యం. దినకర్ గారు, ప్రిన్సిపాల్ సుదామ వంశీ, అధ్యాపకులు అభినందించారు.  శ్రీ పియస్ఆర్ అంజనేయులు గారు, బాబు గారు  శుభాకాంక్షలను తెలియజేశారు. అమ్మ శేష వస్త్రాలను అందించి సత్కరించారు. కొండముది ప్రేమ కుమార్ గారు రామకృష్ణగారి రచనలపై డాక్టరేట్ పట్టాను పొందటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి పరిశోధనలు మరెన్నో చేయాలని అభిప్రాయపడ్డారు.