+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువని, తాను ఆచరిస్తూ, ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపాధ్యాయులు డా.కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురు ప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరించి ఒక్కొక్కరుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఎస్. లక్ష్మణ రావు, ఎ, దినకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండముది ప్రేమ్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.