+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 29-8-2018 న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నంబూరు జడ్.పి.హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి గారు విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.యల్ సుగుణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఏ భాషలోని పదాలనైనా తెలుగులో చాలా సులభంగా స్వీకరించవచ్చని ఉదాహరణ పూర్వకంగా శేషాద్రి తెలియజెప్పారు. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియ గొప్పదనాన్ని వివరించారు. తెలుగు వ్యావహారికభాషోద్యమకారులైన గిడుగువారి కృషిని తెలుగు ఉపాధ్యాయులు డా. మధుసూదనరావు గారు కొనియాడారు. కె.వి.కోటయ్య గారు ప్రసంగిస్తూ అమ్మభాషను నేర్చుకోకుండా పరభాషను నేర్చుకోలేమని ఆంగ్లకవి అన్నవిషయాన్ని గుర్తుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ గారు భాష గొప్పదనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శోభన, అనూషలు పెద్దన్నగారు రచించిన ఉత్పలమాలను ఆశువుగా చెప్పారు. నంబూరు జెడ్.పి హైస్కూల్ విద్యార్థులైన షేక్ హసీనా, షేక్ పాపాంచ్, పోతన రచించిన గద్యమును అనర్గళంగా పఠించారు. గిడుగువారి కీర్తిని విద్యార్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ఆసాంతం విద్యార్థులచే నిర్వంచబడింది.