+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 29 వరకు విద్యార్థినీ విద్యార్థులకు సంగీత శిక్షణ కార్యక్రమం జరిగింది. సంస్థపెద్దలు, అమ్మ భక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాద్ రావు ఈ సంగీత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జూలై 28 వ తేదీన అన్నపూర్ణాలయం సమావేశ మందిరంలో విద్యార్థినీ విద్యార్థులు సంగీత కార్యక్రమం నిర్వహించి అమ్మ భక్తి గీతాలను గానం చేశారు. సంగీతం శ్రోతలను అలరించడంతో పాటు ఆనందాన్ని, అనుభూతిని అందిస్తుందని సంగీత శిక్షకులు రావూరి ప్రసాదావు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు సంస్థ పెద్దలు బ్రహ్మాండం వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్. సుగుణ, శ్రీ యమ్. దినకర్, శ్రీ బి. రామచంద్ర కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమశిక్షణ ఇచ్చిన అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాదును ఘనంగా సత్కరించారు. శ్రీ ప్రసాద్ ఈ సంగీత శిక్షణను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్. సుగుణ, సంస్థ స్థానిక కార్యదర్శి శ్రీ బి. రామచంద్రను అభినందించి ఘనంగా సత్కరించారు.