+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

జాతీయస్థాయి పోటీకి విద్యార్థిని ఎంపిక
2.11.2018 : తిరుపతి రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠంలో జరిగిన జాతీయ స్థాయి శాస్త్ర స్పర్ధలో జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల II పి.డి.సి (సంస్కృతం) విద్యార్థిని శ్యామాలిక ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. అఖిల భారత శాస్త్ర స్పర్ధలో ఈనెల 2, 3 తారీకులలో తిరుపతిలో జరిగిన ఎంపిక పోటీలో శ్యామాలిక 2019 జనవరి 5 వ తేది నుండి త్రిపుర రాజధాని అగర్తలలో ప్రరంభమయ్యే ఈ పోటీలకు శ్యామాలిక ఎంపిక పట్ల సంస్థ పెద్దలు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేశారు. కావ్య కంఠపాఠం (కుమార సంభవము) పై ఈ పోటీ జరగనున్నట్లు తిరుపతి సంస్కృతి విద్యాపీఠం వారు స్పష్టం చేశారు.