+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

గతంలో రాజభాషగా, దేశభాషగా వర్థిల్లిన సంస్కృత భాషను ఆదరించాలని నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి వివరించారు. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 24వ తేదీన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దేశంలోని సకల శాస్త్రాలు, సంస్కృతంలోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించడంతో సంస్కృతానిదే కీలక పాత్ర అని సోదాహరణంగా వివరించారు.