+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

సంస్కృత భాషను దశదిశలా వ్యాపింపజేయాలని, అందుకు సంస్కృతాన్ని అధ్యయనం చేసే మనమంతా. కృషిచేయాలని, ‘సంస్కృత భారతి’ ప్రాంత అధ్యక్షులైన శ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు పిలుపునిచ్చారు. 2.12.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో జరిగిన సభలో సంస్కృతభాషా ప్రాశస్త్యం గురించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడాలని కోరారు. ఒక్కొక్క విద్యార్ధి ఐదుగురికి సంస్కృతం నేర్పుతూ అలా గ్రామంలోని వారందరిచేత సంస్కృతంలో మాట్లాడించాలని తద్వారా జిల్లెళ్ళమూడిని ‘అర్కపురి’ అని పిలిచేలా చేయాలనీ, పిలుపునిచ్చారు. అందుకు తమ సహాయ సహకారాలను అందించాలని డా॥ హనుమంతయ్య గారిని ఈ కార్యక్రమంలో కోరారు. సంస్కృత విభాగంలోని విద్యార్థులు పాల్గొన్నారు.