+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

తెలుగు భాషా సాహిత్యాలు ప్రజల సంపదగా ప్రాచుర్యం పొందాలని ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీగారు ఆగష్టు 29న జరిగిన తెలుగు మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాష ప్రజలభాషగా వర్ధిల్లాలని గిడుగు రామమూర్తి పంతులుగారు భాషోద్యమం నిర్వహించినట్లు తెలిపారు. కళాశాల ఆంధ్రశాఖ ప్రతినిధి డా. ఎల్. మృదులగారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అధ్యాపకులు డా. కె.వి. కోటయ్య, సర్వశ్రీ మడకా సత్యనారాయణ, పి. మధుసూధనరావు, కె. శ్వేత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మాతృభాషా గీతాలను గానం చేశారు. గిడుగు రామమూర్తి చేసిన కృషిని వివరించి శ్రోతల మన్ననలు పొందారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గిడుగు రామమూర్తిపంతులు గారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ నిర్వహించి జేజేలు పలికారు