+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

నవంబరు 13 న జిల్లెళ్లమూడిలో వైద్య ఆరోగ్య శిబిరం ముగిసింది. పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, జ్వరాలు, స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, పి. వెంకటరావు, డా. రామరావు రాజమండ్రి J N.B.B.S, BCH పిల్లల వైద్యనిపుణులు నాగేశ్వరరావు, ఎన్.ఎమ్.ద్వారక. గ్రామ కార్యకర్త బి.లాస్య, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండడంపై పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ప్రేమకుమార్ పాల్గొన్నారు.