+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణగారు అధ్యక్షత వహించారు. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగవిధానాలు ప్రపంచానికి ఎంతో మేలు చేశాయని సాళ్వయోగి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో వివిధ ఆసనాలు వేయించి వాటిప్రయోజనాలను తెలియజేశారు. యోగప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతామని స్పష్టం చేశారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్గారు, శ్రీ టి.టి.అప్పారావుగారు యోగప్రాధాన్యతను వివరించారు.