+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

24.11.2018: గుంటూరు జిల్లా ఖాజీపాలెం K.V.R, K.V.R & M.K.R కళాశాలలో నవంబర్ 24 వ తేదీన జరిగిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీలలో జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాళాశాల విద్యార్ధినులు ఎ. మనీషా, టి.వి.ఎస్.నాగలక్ష్మి, కె. శోభనా సులభాగతి, వి. శ్రావణి పాల్గొని శ్రోతల ప్రశంసలు పొందారు. ఈ వేదిక పై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి ఎల్.మృదుల పాల్గొని జ్యోతి ప్రజ్వలన నిర్వహించి తమకు సహకరించటం పట్ల ఖాజీపాలెం ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణంరాజు, విశ్రాంత ప్రిన్సిపాల్ రామరాజు పలువురు అధ్యాపకులు తమ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బహుమతి ప్రదాతగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి. బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని జిళ్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినుల పద్యగానాన్ని ప్రత్యేకంగా అభినందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కళాశాల I B.A Tel. విద్యార్ధిని కె. శోభనా సులభాగతి పద్యగానాన్ని అభినందిస్తూ పుష్పగుచ్ఛాన్ని ఉపసభాపతి అందించి శుభాశీస్సులు తెలిపారు.