by admin | Apr 1, 2020 | Seminar
సంస్కృతభాష మాతృభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం పరిచయం ఉంటుందని, సంభాషణ ద్వారానే భాష అభివృద్ధి చెందుతుందని సంస్కృతభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారు అధ్యక్ష, భాషణ చేస్తూ భూమినుండి ఆకాశం వరకు సంస్కృతం అణువణువునా వ్యాపించిందని, కళాశాలలో ప్రతి విద్యార్ధి సంస్కృతంలో మాట్లాడగలగాలని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరు నుండి ’’సంభాషణ సందేశం‘‘ అనే సంస్కృత మాసపత్రిక సంపాదకులు జనార్దనహెగ్దే గారు విచ్చేశారు. వారు మాట్లాడుతూ సంస్కృతంలో కేవలం వేద వేదాంగ ఇతిహాస పురాణ కావ్యాలే కాక విజ్ఞానశాస్త్రం కూడా ఉందనీ ఇది సర్వ విదితమని ఉపదేశించారు. అంతేకాక సంస్కృతం భారతదేశానికి కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేస్తుందని కొనియాడారు. భాష యొక్క సౌందర్యం సంభాషణ ద్వారా తెలుస్తుందని సంస్కృత సంభాషణకు సంస్కృత మాసపత్రికలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ీ కార్యక్రమంలో సంస్కృత విభాగంలోని అధ్యాపకులు డా. ఎ. సుధామ వంశీ, డా. అన్నదానం హనుమత్ ప్రసాద్, డా. ఆర్. వరప్రసాద్, డా. వి. పావని. యమ్. వాహిని లు పాల్గొని విద్యార్ధులు సంస్కృతం మాట్లాడేలాగా ఉత్తేజపరిచారు.
by admin | Dec 20, 2019 | Student Competions
ప్రపంచీకరణంలో పరుగులు తీస్తున యువత అన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించాలని ప్రతి సంవత్సరం. డిసెంబర్ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో దాగివున్న విద్యుత్ కాంతులను ప్రశ్నల ద్వారా బహిర్గతం చేసి వారిని పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండేలాగా చేయాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య గారు పిలుపునిచ్చారు. ఈ క్విజ్ పోటీలను 20.12.19 వ తేది శుక్రవారం ప్రిన్సిపాల్ గారు ప్రారంభించగా అధ్యాపకులు దానిని కొనసాగించారు. కార్యక్రమం చివరన విజేతలను ప్రకటించారు.
by admin | Jun 8, 2019 | Seminar
సంస్కృత భాషా శిబిరం జూన్ 8 వ తేది సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డా. సుధామ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం. వారి సంస్కృత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీపోయారి శ్రీకాంత్ (సంస్కృత భారత కార్యకర్త) సంస్కృత భాషా బోధకునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యా రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సంస్కృత భాషను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు మన ధర్మాన్ని గౌరవిస్తున్నాయని వివిధ విశ్వ విద్యాలయాల్లో సంస్కృత అధ్యయన శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇదే వేదికపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేవ భాషగా, మధుర భాషగా, ప్రపంచ భాషగా సంస్కృతానికి గత వైభవాన్ని సంతరించే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. విద్యార్థులు సంస్కృతంలో సంభాషించారు. అధ్యాపకులు డా. కె.వి కోటయ్య డా. పావని డా. ఆర్ వర ప్రసాద్ సంస్కృత ప్రత్యేకతను, ప్రాముఖ్యాన్ని వివరించారు.
by admin | Feb 15, 2019 | Seminar
15.02.2019 న సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రముఖకవి విశ్రాంత జిల్లా ప్రభుత్వ ఖజానా సహాయాధికారి అల్లం జగపతిబాబు వివరించారు. శుక్రవారం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో ప్రజాజీవితం ప్రతిబింబించాలని తెలిపారు. కాళాశాల ప్రిన్సిపాల్ డా॥ సుధామ వంశీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా “షోడశి” తదితర గ్రంథాలను విద్యార్థులకు బహూకరించారు. ఉత్తమ సాహిత్యానికి దిశా నిర్దేశం చేసే శక్తి ఉంటుందని అల్లం జగపతిబాబు సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై విద్యార్థులకు వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం జరిగింది. “అమ్మ సందేశం సమాజాభ్యుదయం” సమాజ ప్రగతిలో విద్యార్థుల పాత్ర, “మాతృభాషా మాధుర్యము”, “విశ్వజనిగా అమ్మ” అనే అంశాలపై వివిధ స్థాయిలలో వక్తృత్వపు పోటీ జరిగింది. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
by admin | Nov 24, 2018 | Student Competions
24.11.2018: గుంటూరు జిల్లా ఖాజీపాలెం K.V.R, K.V.R & M.K.R కళాశాలలో నవంబర్ 24 వ తేదీన జరిగిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీలలో జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాళాశాల విద్యార్ధినులు ఎ. మనీషా, టి.వి.ఎస్.నాగలక్ష్మి, కె. శోభనా సులభాగతి, వి. శ్రావణి పాల్గొని శ్రోతల ప్రశంసలు పొందారు. ఈ వేదిక పై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి ఎల్.మృదుల పాల్గొని జ్యోతి ప్రజ్వలన నిర్వహించి తమకు సహకరించటం పట్ల ఖాజీపాలెం ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణంరాజు, విశ్రాంత ప్రిన్సిపాల్ రామరాజు పలువురు అధ్యాపకులు తమ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బహుమతి ప్రదాతగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి. బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని జిళ్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినుల పద్యగానాన్ని ప్రత్యేకంగా అభినందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కళాశాల I B.A Tel. విద్యార్ధిని కె. శోభనా సులభాగతి పద్యగానాన్ని అభినందిస్తూ పుష్పగుచ్ఛాన్ని ఉపసభాపతి అందించి శుభాశీస్సులు తెలిపారు.