+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని శంకారానంద గిరి స్వామి తెలిపారు. 5/9/2017 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుమహాత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువన్నారు. తాను ఆచరిస్తూ, ఆచరింపజేసేవాడే ఆదర్శ గురువని తెలియ జెప్పారు. తెలుగు ఉపన్యాసకులు కోటయ్యగారు మాట్లాడుతూ గురు ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు. ఎస్. లక్ష్మణ రావు, దినకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండముది ప్రేమ్ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.