+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

12.11. 2022 శనివారం వాత్సల్యాలయంలో కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ పి.గిరిధర్ కుమార్ గారు, డాక్టర్ బి.ఎల్ | సుగుణ గారు, ప్రిన్సిపల్ ఆర్.వరప్రసాద్ గారు, శ్రీ ఎం.దినకర్ గారు, డా॥ యు. వరలక్ష్మి గారు, చిన్నంనాయుడు గారు, రావమ్మ గారు పాల్గొన్నారు. వరప్రసాద్ గారు కళాశాల లక్ష్యాలు పురోగతి ప్రగతి నివేదికలను అందించారు. | సుగుణ గారు మాట్లాడుతూ విద్య కేవలం బతుకు తెరువు కోసమే కాదు జీవిత పరమార్ధాన్ని కూడా తెలుపుతుంది. క్రమశిక్షణతో వివేకంతో మన కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరొంది | ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అమ్మ భావాలకు వారసులై నిలిచా రని అన్నారు.
అనంతరం అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారు మాట్లాడుతూ “ఇలాంటి వేదికలు ఎన్నో జరగాలని సూచించారు. కళాశాల ప్రస్తుత స్థితిని శ్రీ ఎం. దినకర్ గారు వివరించారు. |అనంతరం డాక్టర్ యు. వరలక్ష్మి గారు మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతం వలన మీ పిల్లలను | ఉత్తమంగా తీర్చి దిద్దేందుకే ఈ కళాశాలలో చేర్పించారాని, మన విద్యార్థులు ఉత్తమ పౌరులు కాగలరని తల్లిదండ్రుల నుద్దేశించి పలికారు. గిరిధర కుమార్ గారు మాట్లాడుతూ సమావేశంలో ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. చిన్నంనాయుడు గారు అమ్మ ప్రేరణ మాలో అమృత వాయువులను ప్రవహింప జేస్తుంది కాబట్టే పూర్వ విద్యార్థులమైన మేము పార్వతీపురంలో నిత్యం అన్నప్రసాద వితరణ చేయగలుగుతున్నాము అన్నారు. పూర్వ విద్యార్థిని రావమ్మ గారు మాట్లాడుతూ తాను తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండేలా జీవితాన్ని అందించిన అమ్మకు నమస్సులు తెలిపారు. మొక్క ఎన్నో ఫలాలను ఇచ్చినా మూలం భూమిలోనే ఉంటుంది గనుక విద్యాఫలాలను అందుకున్న వారు మాతృ సంస్థను మరవరాదని అన్నారు. కార్యక్రమంలో ఇంటర్న్ షిప్ ను సజావుగా నడిపించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మార్గదర్శనం చేసిన శ్రీ ఓంకారానంద గిరి స్వామివారిని సన్మానించారు యాజమాన్యం వారు. రాబోయే అమ్మ శతజయంతి ఉత్సవాలకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. శాంతిమంత్రం పఠనంతో నాటి కార్యక్రమం ముగిసింది.