కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణగారు అధ్యక్షత వహించారు. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగవిధానాలు ప్రపంచానికి ఎంతో మేలు చేశాయని సాళ్వయోగి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో వివిధ ఆసనాలు వేయించి వాటిప్రయోజనాలను తెలియజేశారు. యోగప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతామని స్పష్టం చేశారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్గారు, శ్రీ టి.టి.అప్పారావుగారు యోగప్రాధాన్యతను వివరించారు.

అమ్మ ఆశీస్సులతో నూతన విద్యా సంవత్సరం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 2019-20 విద్యా సంవత్సరం ది. 10.6.2019 సోమవారం నాడు ప్రారంభమైనది. ఈ సందర్భంగా అమ్మ ఆలయంలో కళాశాల అభివృద్ధికై పూజను నిర్వహించారు. అమ్మ పాదాల చెంత వార్షిక పుస్తకాలను ఉంచి లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఉభయ పరిషత్ ల అధ్యక్షులు శ్రీ. ఎమ్. దినకర్ గారు, రాము గారు, కామరాజు గారు, శ్రీరామమూర్తి గారు తదితర పెద్దలు మరియు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.సుధామ వంశీ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

శబ్దకాలుష్యం నివారించండి

సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డా॥కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లాళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో శబ్ద కాలుష్యం నానాటికీ అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ సుధామ వంశీ అధ్యక్షత వహించారు. కాలుష్య నివారణలో, ఆరోగ్య సాధనలో యోగా విభాగానికి ప్రాధాన్యము లభిస్తున్నట్లు డా॥ కె. సత్యమూర్తి వివరించారు. సంగీతశాస్త్రం మానవ జాతి వికాసంలో భాగం కావాలని ఆయన హితవు పలికారు. కర్ణభేరిని బద్దలు చేసే విపరీత శబ్దాలకు మాధుర్యం ఉండదని డా.కె. సూర్యమూర్తి సోదాహరణంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు

సంస్కృత సంభాషణ శిబిరం

సంస్కృత భాషా శిబిరం జూన్ 8 వ తేది సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ  పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డా. సుధామ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం. వారి సంస్కృత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీపోయారి శ్రీకాంత్ (సంస్కృత భారత కార్యకర్త) సంస్కృత భాషా బోధకునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యా రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సంస్కృత భాషను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు మన ధర్మాన్ని గౌరవిస్తున్నాయని వివిధ విశ్వ విద్యాలయాల్లో సంస్కృత అధ్యయన శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇదే వేదికపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేవ భాషగా, మధుర భాషగా, ప్రపంచ భాషగా సంస్కృతానికి గత వైభవాన్ని సంతరించే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. విద్యార్థులు సంస్కృతంలో సంభాషించారు.   అధ్యాపకులు డా. కె.వి కోటయ్య డా. పావని డా. ఆర్ వర ప్రసాద్ సంస్కృత ప్రత్యేకతను, ప్రాముఖ్యాన్ని వివరించారు.

సంస్కృత సంభాషణ శిబిరం

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత భాషా శిబిరం జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంస్కృతపాఠశాల ఉపాధ్యాయులు శ్రీ పోలూరి శ్రీకాంత్ (సంస్కృత భారతి కార్యకర్త) సంస్కృత భాషా బోధకునిగా శిబిర చాలకునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యారంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సంస్కృత భాషను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. మహోన్నతమైన సంస్కృతభాష ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు గౌరవిస్తున్నాయని వివిధ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత అధ్యయన శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇదే వేదికపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేవభాషగా, మధురభాషగా, ప్రపంచభాషగా మహోన్నత స్థానంలో ఉన్న సంస్కృతానికి గత వైభవాన్ని సంతరించే బాధ్యత అందరిదీ అని ఆయన హితవు పలికారు. శ్రీ పోలరి శ్రీకాంత్ అధ్యయనం తరగతులు నిర్వహించారు.