Swarna Andhra Swachcha Andhra

ENDING OF PLASTIC
🌿 ప్లాస్టిక్ నివారణపై సృజనాత్మక కార్యక్రమం
మాతృశ్రీ ఓరియెంటల్ కళాశాలలో “ప్లాస్టిక్ నివారణ” అనే అంశంపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రణాళికలో భాగంగా జూలై 19, 2025న జరిగింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల మధ్య వివిధ పోటీలు నిర్వహించబడ్డాయి:

🔸 చిత్రలేఖనం
🔸 వ్యాసరచన
🔸 క్రాఫ్ట్ వర్క్
🔸 స్లోగన్స్

B. A ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగం పై అవగాహన కలిగించేలా *ఓ నాటిక (స్కిట్)*ను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. ప్లాస్టిక్ కారణంగా భవిష్యత్ లో ఏర్పడే ప్రమాదాలను అరికట్టేవిధంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని వైస్ ప్రిన్సిపాల్ డా. ఎల్. మృదుల నిర్వహించారు. విద్యార్థుల భాగస్వామ్యం, వారి సృజనాత్మకత మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలిచింది. కార్యక్రమంలో 158 మంది విద్యార్థులు, 12 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.

గురుపూర్ణిమ/Gurupoornima

గురుపూర్ణిమ/Gurupoornima

ఘనంగా గురుపౌర్ణమి కార్యక్రమం

ది 10.07.2025 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గురుపౌర్ణమి సందర్భంగా సభాకార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరు  హిందూ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గురు పరంపర ద్వారానే భారతదేశం విశ్వగురువుగా నిలిచిందని, గురువు జీవితానికి మార్గదర్శకుడే కాక సంస్కృతి పరిరక్షకుడుగా కూడా ఉండాలని తెలిపారు. ఎంతోమంది శిష్యులను తయారు చేయడం వలన వ్యాసభగవానుడి పేరుతో ఈ పర్వదినము వ్యాసపూర్ణిమగా పేరొందిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, Honorary Chairman శ్రీ M.దినకర్ గారు, కోశాధికారి శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథికి ఘనంగా గురుసత్కారం చేశారు. అనంతరం గురుపాదుకాస్తోత్ర పారాయణ జరిగింది. కళాశాల విద్యార్థినీ విద్యార్థులే సభానిర్వహణ చేశారు. కళాశాల సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ ఆర్ వరప్రసాద్ గారు వందనసమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో  కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

International Day against Drug Abuse & Illicit Trafficking program under Nasa Mukth Bharath Abhiyan

International Day against Drug Abuse & Illicit Trafficking program under Nasa Mukth Bharath Abhiyan

విద్యార్థుల సంక్షేమం, సమాజ పట్ల బాధ్యతను అవగాహన కల్పించేందుకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారు 26-06-2025 గురువారం EAGLE CLUB మరియు NSS UNIT సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేటూరు గ్రామ సచివాలయం మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి గారు విచ్చేసి మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన పరిణామాలు, సమాజంపై ప్రభావం వంటి విషయాలను వివరించారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి, యువత మత్తుమందులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలన్న సందేశాన్ని ఇచ్చారు. సంస్కృత విభాగాధిపతి Dr. RVNSS వరప్రసాద్ గారు విద్యార్థులను ఉద్దేశించి భారతీయ జ్ఞానపరంపరలోని నైతిక విలువలు, మానసిక స్థైర్యం గురించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని NSS Convener శ్రీ T.జయకృష్ణ గారు నిర్వహించారు. NSS స్వచ్ఛంద సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొని మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఈ అవగాహనను పెంపొందించాలనే ప్రతిజ్ఞ చేశారు. శాంతిమంత్రం తో కార్యక్రమం ముగిసింది.

International Yoga Day/అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day/అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగాంధ్ర కార్యక్రమం – సంక్షిప్త నివేదిక
(జూన్ 7 – జూన్ 21, 2025)
జూన్ 7 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం లో భాగంగా ప్రతిరోజూ ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల బాలికల మరియు బాలుర వసతి గృహాలలో యోగా సాధన చేయించారు. కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు యోగాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజున బాపట్ల నుండి వచ్చిన యోగా శిక్షకులు శ్రీ Ch.కేశవులు గారు విద్యార్థులతో యోగా సాధన చేయించారు.
తరువాత నిర్వహించిన సభలో SVJP TRUST Honorary Chairman శ్రీ M. దినకర్ గారు, Managing Trusty శ్రీ వల్లూరి ప్రేమ్ కుమార్ గారు పాల్గొన్నారు. శ్రీ వల్లూరి ప్రేమ్ కుమార్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్‌ప్రసాద్ గారు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని సంస్కృత విభాగాధిపతి శ్రీ ఆర్. వరప్రసాద్ నిర్వహించారు. చివరిగా యోగా శిక్షకులకు మరియు వారి బృందానికి యాజమాన్యం వారు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది. యోగా అనేది శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపేందుకు సాయంత్రం కళాశాల నుండి అధ్యాపకులు విద్యార్థులు జిల్లెళ్ళముూడి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.   గ్రామప్రజలకు యోగా గురించి అర్థమయ్యేలా  వివరించి చెప్పారు. 15 మంది అధ్యాపకులు 142 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.