by MOC IQAC | Apr 2, 2026 | Health & Hygeine, Life Skills
Organized by: NSS Unit / IQAC in collaboration with MMC (Matrusri Medical Centre, Jillellamudi)
Objective of the Program:
- To create awareness about personal health and regular medical checkups among students and staff.
- To provide basic diagnostic services and promote health consciousness.
Description of the Program:
- Medical personnel from MMC conducted free blood tests for students and staff in the college campus.
- Tests included hemoglobin, sugar, BP, and general health indicators. Students actively participated and understood the importance of maintaining good health and regular checkups.
No. of Participants: Students: 80, Staff: 10, Total: 90
Outcome:
- Students became aware of their health status.
- Encouraged regular health monitoring and healthy lifestyle habits.
Coordinators: Sri. T. Jaya Krishna, NSS Programme Officer, G. Veeranjaneyulu, K. Nagarjuna.
by MOC IQAC | Oct 19, 2024 | Faculty Development Program, Skill Programmes
A faculty development program in communication skills was started on 16th October 2024 at Matrusri Oriental College, Jillellamudi. Smt. Anuradha was the resource person. All teaching and non-teaching staff participated in this program. Smt. Anuradha explained the objectives and outcomes of the program. On 19th October 2024, she addressed MOC students. With renewed confidence, some of the staff members gave feedback in English. All staff members felicitated Smt. Anuradha with Amma prasadam. By the end of this program, Smt. Anuradha announced these communication classes would be continued online from 23rd October onwards. The program was concluded with the Santhi mantra.
by admin | Jun 21, 2024 | International Commemorative Days, Yoga
యోగేన యోగో జ్ఞాతవ్యో – యోగో యోగాత్ ప్రవర్తతే !
యో2ప్రమత్తస్తు యోగేన – స యోగీ రమతే చిరమ్ !!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగాధ్యాపకురాలు శ్రీమతి డా. చుండూరు నాగసాయి అనూష గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హిస్టరీ విభాగం పక్షాన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో ప్రిన్పిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణం చేస్తూ యోగా అనేది మానసిక, శారీరక రుగ్మతలనుండి దూరం చేయగలదని వివరించారు. ముఖ్యంగా స్రీలకు వచ్చే అనారోగ్యాలు సులభమైన ఆసనాలతో నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి అనూష గారు అష్టాంగయోగాలను సవివరంగా తెలిపి ప్రత్యక్షంగా ఆసనాలు వేసి ప్రాణాయామాలలో రకాలను తెలిపి వాటిద్వారా అనేక రుగ్మతలకు ఉన్న నివారణోపాయాలను వివరించారు. నిత్యజీవితంలో యోగాతో అనుబంధం కలిగి ఉంటే రోగాలతో బంధ హీనులం కావచ్చని సూచించారు. ఆధునిక మానవ జీవన శైలి లో యోగాభ్యాసాన్ని అలవరచుకున్నట్లైతే చిరకాలం జీవించగలమన్నారు. హిస్టరీ ఉపన్యాసకులు శ్రీ పి. సుందరరావు గారు సభాసంచాలనం చేస్తూ యోగా ప్రత్యేకతను గుర్తించి గత పది సంవత్సరాలుగా అనేకవిధాలైన కాన్సెప్ట్ లతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ముదావహమని తెలిపారు. అనంతరం విద్యార్థుల యోగాసనాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
by admin | Aug 26, 2023 | Life Skills, Personality Development, Skill Programmes
Wavicle Inner Holistic Wellness Solutions – Workshop
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2023 ఆగస్టు 25,26 శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు Life Skills and Personality Development Program లో భాగంగా బెంగుళూరు Wavicle – Inner Holistic Solutions నుండి Nirav Advaya, Ananda Urja లు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్య కేవలం విద్యా విషయక ఙ్ఞానం మాత్రమే కాకుండా జీవితానికి సిద్ధం చేయడం అనే ఆలోచన తో కళాశాల మేనేజింగ్ కమిటీ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా వ్యక్తిగత అభివృద్ధి మెరుగైన కమ్యూనికేషన్, బెటర్ డెసిషన్ మేకింగ్ హోలిస్టిక్ అప్రోచ్ అంశాలతో ట్రైనింగ్ అందించారు.
by admin | Aug 29, 2022 | Language & Communication Skills
నాస్తికునిగా ఉన్న నన్ను ఆస్తికునిగా మార్చి అమ్మ దివ్య పాదాల అందెల రవళి లోని మాధుర్యాన్ని తనకు పరిచయం చేసిందని శ్రీ కోన రమణరావుగారు అన్నారు. ఆగస్టు 29వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన మాతృభాషా దినోత్సవ సభలో ప్రముఖ రచయిత చిత్రకారులు బహుముఖ ప్రజ్ఞాభూషణ శ్రీ కోన రమణరావుగారు మాట్లాడుతూ లక్ష మందికి ఏక పంక్తి లోఅమ్మ భోజనం పెట్టిన నాడు తాను పాల్గొన్నానని స్మరించుకున్నారు. అనంతరం బందా వేంకట కృష్ణశక్తిధర్ తెలుగు ఉపన్యాసకులు (చీరాల) తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే అనేక శాసనాలను ఉటంకిస్తూ భట్టిప్రోలు శాసనం మన తెలుగుభాష అజంత భాష అని తెలియజేసే శాసనంగా తీసుకోవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ నారాయణం శేషుబాబు గారు తెలుగు ఉపన్యాసకులు ప్రసంగిస్తూ తెలుగు భాష ఒక పుష్పక విమానంలా మారుతున్న సమయంలో వ్యవహార భాషా ఉద్యమం మొదలైందని కనుకనే ఇంకా మన భాష మన జాతి వెలుగులో ఉన్నాయని విశ్లేషించి చెప్పారు. అనంతరం శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్ తరఫున అతిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. శ్రీ కోన రమణరావు గారు పలు సాహిత్య గ్రంధాలను ఆంధ్రభారతి పెయిటింగ్ ను కళాశాల గ్రంథాలయానికి అందించారు. నారాయణ శేషుబాబు గారు ప్రాచీనాంధ్ర కథాకావ్యాలు – నీతి బోధ అనే తన శోధ ప్రబంధాన్ని విద్యార్థులకు మరియు గ్రంథాలయానికి కొన్ని ప్రతులను అందించారు.
by admin | Aug 21, 2021 | Yoga
“వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్ ।
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్ ||
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ‘యోగా’ అనేది ఒక అత్యుత్తమమైన సాధనం. ప్రపంచ దేశాలన్నీ ఏకమై జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా Spiritual Master, HRM Trainer శ్రీమతి S.P.అన్నపూర్ణ గారు మరియు సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సిద్ధార్థ గారు పాల్గొన్నారు. సభలో శ్రీమతి అన్నపూర్ణ గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ సాధకులకు, జిజ్ఞాసులకు ఆలవాలమైన మన భారతదేశంలో నాల్గవ శతాబ్దంలో పతంజలి మహర్షి యోగసూత్రాలను మనకు అందించారని యోగ సాధనతో సాధించలేనిది లేదని తెలియజేశారు. సత్యం, ధర్మం, శీలం అనే మూడు సూత్రాల కలయికతో జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని పొందాలని వివరించారు. శ్రీ సిద్దార్థ్ గారు తాను తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల గ్రామం నుంచి అందరినీ విద్యావంతులను చేయాలనే ఒక లక్ష్యంతో బయలుదేరి ముందుకు వెళుతున్న తనకు ఈరోజున మన ఆశ్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మ అందించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని జ్ఞాన ప్రమిదలుగా అందరూ వెలుగొందాలని చెప్పారు. అనంతరం కళాశాల చరిత్ర అధ్యాపకులు P. సుందరరావుగారు మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యం ఉంటుందని, అది యోగా ద్వారానే సాధ్యమని పలు ఉదాహరణలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగ ఆవశ్యకత, షట్చక్రాలు, సూర్య నమస్కారాలు వంటి పలు అంశాలలో వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈపోటీలకు డా.A. హనమత్ప్రసాద్ గారు, శ్రీమతి.L.మృదుల గారు, శ్రీమతి.M.కవిత గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగు అధ్యాపకులు I.V.S. శాస్త్రి గారు సభానిర్వహణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.