Skill Enhancement Programme

Skill Enhancement Programme

          A faculty development program in communication skills was started on 16th October 2024 at Matrusri Oriental College, Jillellamudi. Smt. Anuradha was the resource person. All teaching and non-teaching staff participated in this program. Smt. Anuradha explained the objectives and outcomes of the program. On 19th October 2024, she addressed MOC students. With renewed confidence, some of the staff members gave feedback in English. All staff members felicitated Smt. Anuradha with Amma prasadam. By the end of this program, Smt. Anuradha announced these communication classes would be continued online from 23rd October onwards. The program was concluded with the Santhi mantra.

 

International Yoga Day Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగేన యోగో జ్ఞాతవ్యో – యోగో యోగాత్ ప్రవర్తతే !
యో2ప్రమత్తస్తు యోగేన – స యోగీ రమతే చిరమ్ !!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగాధ్యాపకురాలు శ్రీమతి డా. చుండూరు నాగసాయి అనూష  గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హిస్టరీ విభాగం పక్షాన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో ప్రిన్పిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణం చేస్తూ యోగా అనేది మానసిక, శారీరక రుగ్మతలనుండి దూరం చేయగలదని వివరించారు. ముఖ్యంగా స్రీలకు వచ్చే అనారోగ్యాలు సులభమైన ఆసనాలతో నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి అనూష గారు అష్టాంగయోగాలను సవివరంగా తెలిపి ప్రత్యక్షంగా ఆసనాలు వేసి ప్రాణాయామాలలో రకాలను తెలిపి వాటిద్వారా అనేక రుగ్మతలకు ఉన్న నివారణోపాయాలను వివరించారు. నిత్యజీవితంలో యోగాతో అనుబంధం కలిగి ఉంటే రోగాలతో బంధ హీనులం కావచ్చని సూచించారు. ఆధునిక మానవ జీవన శైలి లో యోగాభ్యాసాన్ని అలవరచుకున్నట్లైతే చిరకాలం జీవించగలమన్నారు. హిస్టరీ ఉపన్యాసకులు శ్రీ పి. సుందరరావు గారు సభాసంచాలనం చేస్తూ యోగా ప్రత్యేకతను గుర్తించి గత పది సంవత్సరాలుగా అనేకవిధాలైన కాన్సెప్ట్ లతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ముదావహమని తెలిపారు.  అనంతరం విద్యార్థుల యోగాసనాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2023 ఆగస్టు 25,26 శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు Life Skills and Personality Development Program లో భాగంగా బెంగుళూరు Wavicle – Inner Holistic Solutions నుండి Nirav Advaya, Ananda Urja లు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్య కేవలం విద్యా విషయక ఙ్ఞానం మాత్రమే కాకుండా జీవితానికి సిద్ధం చేయడం అనే ఆలోచన తో కళాశాల మేనేజింగ్ కమిటీ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా వ్యక్తిగత అభివృద్ధి మెరుగైన కమ్యూనికేషన్, బెటర్ డెసిషన్ మేకింగ్  హోలిస్టిక్ అప్రోచ్ అంశాలతో ట్రైనింగ్ అందించారు.

Recent Events
Skill Enhancement Programme

Skill Enhancement Programme

          A faculty development program in communication skills was started on 16th October 2024 at Matrusri Oriental College, Jillellamudi. Smt. Anuradha was the resource person. All teaching and non-teaching staff participated in this program. Smt. Anuradha...

read more
International Yoga Day Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగేన యోగో జ్ఞాతవ్యో - యోగో యోగాత్ ప్రవర్తతే ! యో2ప్రమత్తస్తు యోగేన - స యోగీ రమతే చిరమ్ !! అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగాధ్యాపకురాలు శ్రీమతి డా. చుండూరు నాగసాయి అనూష  గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హిస్టరీ విభాగం...

read more
Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2023 ఆగస్టు 25,26 శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు Life Skills and Personality Development Program లో భాగంగా బెంగుళూరు Wavicle – Inner Holistic Solutions నుండి Nirav Advaya, Ananda Urja లు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు....

read more

కళాశాల వార్తలు (మాతృభాషా దినోత్సవం)

నాస్తికునిగా ఉన్న నన్ను ఆస్తికునిగా మార్చి అమ్మ దివ్య పాదాల అందెల రవళి లోని మాధుర్యాన్ని తనకు పరిచయం చేసిందని శ్రీ కోన రమణరావుగారు అన్నారు. ఆగస్టు 29వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన...

read more

విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ యోగా దినోత్సవం)

"వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్ । ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్ || ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి 'యోగా' అనేది ఒక అత్యుత్తమమైన సాధనం. ప్రపంచ దేశాలన్నీ ఏకమై జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా...

read more

అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ 21వ తేదీ బుధవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సభ జరిగింది. ఉదయం 10 గంటలకు  కళాశాల ప్రిన్సిపల్(IC) డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు తమ అధ్యక్షోపన్యాసంలో కర్మభూమి అయిన మన భారతదేశంలో మానవుడు చిరంజీవిగా ఉండేందుకు  ఋషులు మనకు అందించిన...

read more

వ్యక్తిత్వవికాసము

సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన  నినాదాలని జి.యల్.మునోహర్ గారు తెలిపారు. ది. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. ఇక్కడ చదివే విద్యార్థులు అమ్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందియున్నారని మనోహర్ గారు తెలిపారు....

read more

విద్యాపరిషత్ వార్తలు

సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన క్రోధాన్ని విడనాడాలని శ్రీ జి.యల్. మనోహర్ గారు తెలిపారు. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న విద్యార్థులు అధ్యాపకులు అమ్మ సంపూర్ణమైన...

read more

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మానవతా విలువలు

చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం 'ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న' అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు...

read more

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మానవతా విలువలు

చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం 'ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న' అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు...

read more

కళాశాల వార్తలు (మాతృభాషా దినోత్సవం)

నాస్తికునిగా ఉన్న నన్ను ఆస్తికునిగా మార్చి అమ్మ దివ్య పాదాల అందెల రవళి లోని మాధుర్యాన్ని తనకు పరిచయం చేసిందని శ్రీ కోన రమణరావుగారు అన్నారు. ఆగస్టు 29వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన మాతృభాషా దినోత్సవ సభలో ప్రముఖ రచయిత చిత్రకారులు బహుముఖ ప్రజ్ఞాభూషణ శ్రీ కోన రమణరావుగారు మాట్లాడుతూ లక్ష మందికి ఏక పంక్తి లోఅమ్మ భోజనం పెట్టిన నాడు తాను పాల్గొన్నానని స్మరించుకున్నారు. అనంతరం బందా వేంకట కృష్ణశక్తిధర్ తెలుగు ఉపన్యాసకులు (చీరాల) తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే అనేక శాసనాలను ఉటంకిస్తూ భట్టిప్రోలు శాసనం మన తెలుగుభాష అజంత భాష అని తెలియజేసే శాసనంగా తీసుకోవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ నారాయణం శేషుబాబు గారు తెలుగు ఉపన్యాసకులు ప్రసంగిస్తూ తెలుగు భాష ఒక పుష్పక విమానంలా మారుతున్న సమయంలో వ్యవహార భాషా ఉద్యమం మొదలైందని కనుకనే ఇంకా మన భాష మన జాతి వెలుగులో ఉన్నాయని విశ్లేషించి చెప్పారు. అనంతరం శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్ తరఫున అతిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. శ్రీ కోన రమణరావు గారు పలు సాహిత్య గ్రంధాలను ఆంధ్రభారతి పెయిటింగ్ ను కళాశాల గ్రంథాలయానికి అందించారు. నారాయణ శేషుబాబు గారు ప్రాచీనాంధ్ర కథాకావ్యాలు – నీతి బోధ అనే తన శోధ ప్రబంధాన్ని విద్యార్థులకు మరియు గ్రంథాలయానికి కొన్ని ప్రతులను అందించారు.

విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ యోగా దినోత్సవం)

“వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్ ।
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్ ||
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ‘యోగా’ అనేది ఒక అత్యుత్తమమైన సాధనం. ప్రపంచ దేశాలన్నీ ఏకమై జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా Spiritual Master, HRM Trainer శ్రీమతి S.P.అన్నపూర్ణ గారు మరియు సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సిద్ధార్థ గారు పాల్గొన్నారు. సభలో శ్రీమతి అన్నపూర్ణ గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ సాధకులకు, జిజ్ఞాసులకు ఆలవాలమైన మన భారతదేశంలో నాల్గవ శతాబ్దంలో పతంజలి మహర్షి యోగసూత్రాలను మనకు అందించారని యోగ సాధనతో సాధించలేనిది లేదని తెలియజేశారు. సత్యం, ధర్మం, శీలం అనే మూడు సూత్రాల కలయికతో జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని పొందాలని వివరించారు. శ్రీ సిద్దార్థ్ గారు తాను తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల గ్రామం నుంచి అందరినీ విద్యావంతులను చేయాలనే ఒక లక్ష్యంతో బయలుదేరి ముందుకు వెళుతున్న తనకు ఈరోజున మన ఆశ్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మ అందించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని జ్ఞాన ప్రమిదలుగా అందరూ వెలుగొందాలని చెప్పారు. అనంతరం కళాశాల చరిత్ర అధ్యాపకులు P. సుందరరావుగారు మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యం ఉంటుందని, అది యోగా ద్వారానే సాధ్యమని పలు ఉదాహరణలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగ ఆవశ్యకత, షట్చక్రాలు, సూర్య నమస్కారాలు వంటి పలు అంశాలలో వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈపోటీలకు డా.A. హనమత్ప్రసాద్ గారు, శ్రీమతి.L.మృదుల గారు, శ్రీమతి.M.కవిత గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగు అధ్యాపకులు I.V.S. శాస్త్రి గారు సభానిర్వహణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ 21వ తేదీ బుధవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సభ జరిగింది. ఉదయం 10 గంటలకు  కళాశాల ప్రిన్సిపల్(IC) డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు తమ అధ్యక్షోపన్యాసంలో కర్మభూమి అయిన మన భారతదేశంలో మానవుడు చిరంజీవిగా ఉండేందుకు  ఋషులు మనకు అందించిన శాస్త్రాలలో యోగ శాస్త్రం ఒకటని తెలిపారు. మానవునిలోని షడ్చక్రాలను చైతన్య పరచడమే దీని లక్ష్యమని అష్టాంగ యోగంలో ప్రధానమైన ఆసన, ప్రాణాయామాల ద్వారా మనో నిగ్రహాన్ని కలిగించుకోగలమని వివరించారు. అనంతరం ఆత్మీయ అతిథి ఓంకారానంద గిరిస్వామి గారు రచించిన *సుగతి యోగం* అనే పుస్తకాన్ని ప్రిన్సిపాల్ గారు ఆవిష్కరించారు. 

 గారు సుగతి యోగంలోని విషయాలను తెలియపరుస్తూ రచయిత జిల్లెళ్ళమూడి అమ్మ చరిత్రను సంగ్రహించి వ్రాయ తలపెట్టిన తనకు అమ్మ జీవితమే ఒక దివ్య యోగంలా అనిపించి ఆమెను యోగమూర్తిగా దర్శించి దివ్యమైన అనంతమైన జీవిత పరమావధిని తెలుపుతూ ఈ పుస్తకాన్ని రచించినట్లుగా చెప్పారు. *ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే* అని చెప్పిన యోగశిఖోపనిషత్తుకు దగ్గరగా అమ్మ ‘ద్వంద్వాల మీదనే ఈ సృష్టి ఆధారపడి ఉంద’ని తెలిపిందన్నారు. 

జాండ్రపేట నుంచి ప్రముఖ యోగాచార్యులు శ్రీ పద్మనాభుని తులసీరావు మాధవి దంపతులు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఆర్. వరప్రసాద్ గారు విశిష్ట అతిథిని సభకు పరిచయం చేశారు. తులసీ రావు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అందరిలో ఉండే ఉత్సాహమే ఉత్సవంగా మారుతుంది కనుక అందరూ చిన్నచిన్న యోగాసనాల ద్వారా ఆరోగ్యవంతులుగా ఉత్సాహవంతులుగా ఉండవచ్చునని తెలిపారు.  యోగ అంటే కలయిక ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ రెండింటిని సమతుల్యం చేసుకోగలిగితే మనలో ఉన్న అనంతమైన శక్తి బయటకు వస్తుందని వివరించారు. పార్టిసిపేటివ్ మెథడ్ అనుసరిస్తూ విద్యార్థులతో మాట్లాడిస్తూ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ద్వారా వచ్చే శక్తిని ప్రత్యక్షంగా అనుభవించేలా చేశారు. మన ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండగలదని  తెలిపారు. కార్యక్రమంలో సత్యమూర్తి గారికి తులసిరావు, మాధవి దంపతులకు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కార్యక్రమం ఆసాంతం తెలుగు ఉపన్యాసకులు శ్రీ బి.వి. శక్తిధర్ గారు సభా నిర్వహణ చేయగా డాక్టర్ యల్. మృదుల గారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వందన సమర్పణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.